బిహార్‌లో కూలిన మరో వంతెన

51చూసినవారు
బిహార్‌లో కూలిన మరో వంతెన
బిహార్‌లో మరో బ్రిడ్జి కూలిపోయింది. కిషన్ గంజ్ జిల్లాలోని కంకై ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల వంతెన గురువారం కూలిపోయింది. ఇది బహదుర్‌గంజ్, దిఘల్‌బ్యాంక్ బ్లాక్‌లను కలుపుతుంది. దీంతో రెండు పట్టణాల మధ్య రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా, ఇటీవల బిహార్‌లో మూడు వంతెనలు కూలిపోగా, ఇప్పుడు మరో వంతెన కూలిపోవడం కలవరపెడుతోంది. ఈ వంతెనను ఆరేళ్ల క్రితమే నిర్మించినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్