ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక అర్హులైన పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష అందజేస్తామని వెల్లడించింది. 'మహిళా మహాలక్ష్మీ' గ్యారంటీ కింద కుటుంబంలోని ఒక మహిళకు ఈ లక్ష రూపాయల సాయాన్ని అందిస్తామని తెలిపింది. వైఎస్ షర్మిల నాయకత్వంలోనే రాజన్న రాజ్యం సాధ్యమని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ట్వీట్ చేసింది.