తిరుపతిలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు

AP: ఎన్నిక‌ల నేప‌థ్యంలో తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో ఘర్షణలు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పోలీస్ స్టేష‌న్‌లో నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్ వివరాలను పరిశీలించింది. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై కూడా సిట్ విచారించింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించ‌నుంది.

సంబంధిత పోస్ట్