కార్యకర్తలకు టిడిపి అండగా నిలుస్తుందని సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మనుబోలు మండలం లోని వీరంపల్లి పంచాయతీ, కొండుపాలెం గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో చనిపోయిన తెలుగుదేశం కార్యకర్తలైన శేషం రాగమ్మ తాళ్లూరు రమణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సంతాపం వ్యక్తం చేశారు.