బైక్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు

8275చూసినవారు
బైక్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతసాగరం- సోమశిల ప్రధాన రహదారిపై పికే పాడు ఇసుక రీచ్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమశిల నుంచి అనంతసాగరం వస్తున్న బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకున్న ఎస్ఐ సుబ్బారావు స్థానిక ఆర్ఎంపి డాక్టర్ సహకారంతో చికిత్స చేయించారు. అనంతరం 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చెన్నై వాసిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్