'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత సీఎం జగన్ రేపటి నుంచి 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ కు నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయునిపల్లి మీదుగా ఆళ్లగడ్డకు తొలి రోజు యాత్ర చేరుకుంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్