హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో రైస్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మోసం చేసిన నిర్వాకం బయటపడింది. 3 నెలల క్రితం గచ్చిబౌలిలో బ్రాంచ్ ప్రారంభించిన కంపెనీ.. దేశంలో 5 నగరాల్లో బ్రాంచీలు చూపి భారీగా డబ్బు వసూలు చేసింది. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 50 వేలు వసూలు చేసింది. ఇప్పుడు కంపెనీ మూసి వేశామని ఉద్యోగులకు యాజమాన్యం చెప్పడంతో సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుని మోసం చేశారని ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. రాయదుర్గం పీఎస్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.