అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు

జమ్మూకశ్మీర్‌తో పాటు హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. జులై 1 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్