ఏపీ సీఎం జగన్పై శనివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కంటికి గాయం అవ్వగా.. అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి సీఎం జగన్ను తరలించారు. ఆస్పత్రి వైద్యులు సీఎం జగన్కు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చికిత్స అనంతరం సీఎం జగన్ గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి ప్రాంతానికి వెళ్లిపోయారు.