విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు సీఎంపై దాడి చేసిన సమయంలో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. సీఎం పర్యటన ఉన్న రూట్లో పలు సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ఆయనపై ఒక ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.