సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా వైసీపీ స్పందించింది. "విజయవాడలో సీఎం జగన్పై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పచ్చమూకలు పిరికిపంద చర్యకు పాల్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు." అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.