భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం గడగడలాడిపోయింది. భీకరగాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంప్పై కుప్పకూలగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఈ మేరకు అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు.