గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్కర్తో రుద్దడంతో వివాదం నెలకొంది. దీంతో కొంత సమయం పోలింగ్ నిలిచిపోయింది. ఈ బూత్లో మొత్తం 1,196 ఓట్లున్నాయి. 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియజేశారు. ఎస్పీ రితిరాజ్ బూత్ వద్దకు వచ్చి పోలింగ్ అధికారితో మాట్లాడారు. ఈవీఎం ప్యాడ్పైన తుడవడంతో కారు గుర్తు మళ్లీ పూర్తిగా కనిపించింది. అనంతరం పోలింగ్ కొనసాగించారు.