వైఎస్ భారతికి నలుగురు, తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్తోపాటు లోటస్పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం జగన్ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంటారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులకు కూడా దేశ, విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంతగా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో మరెవరూ ఉండరేమో?.