తాడేపల్లిలో జగన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్పోస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ప్యాలెస్ చుట్టూనే కాదు ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజి సహా అడుగడుగునా చెక్పోస్టులే. ఒక్కోచోట 10 నుంచి 16 మంది కాపు కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. సీఎం రక్షణలో నిమగ్నమయ్యే బాంబ్ స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు అదనం. మొత్తం 389 మంది భద్రతా సిబ్బందికి 50% అదనపు భత్యం చెల్లిస్తున్నారు.