అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్తోపాటు అతని లివింగ్ పార్ట్నర్ పవిత్రగౌడతో సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా రేణుకాస్వామి తల్లిదండ్రులు ఈ రోజు బెంగళూర్లో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. స్వామి కేసులో ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు తమ కోడలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరారు.