గవర్నర్‌ను కలిసిన ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం

72చూసినవారు
గవర్నర్‌ను కలిసిన ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం
తమిళనాడులోని కళ్లకురిచి నాటు సారా ఘటనలో మృతుల సంఖ్య 61 చేరింది. ఈ వ్యవహరంపై ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి, ఆ పార్టీ నేతలు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రాజ్‌భవన్‌లో మంగళవారం కలిశారు. భేటీ అనంతరం మాట్లాడుతూ.. కల్తీ మద్యం ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాలు వెలుగుచూసేందుకు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్