గత ప్రభుత్వం పుణ్యమా అని గడిచిన అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ గంజాయికి చిరునామాగా మారింది. దిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ పేరే వినిపిస్తోంది. మత్తుకు బానిసై యువత జీవితాలు నాశనమవుతున్నా జగన్కు ఏమాత్రం పట్టలేదు. గంజాయిని నిరోధించడానికి ఏపీలో నూతన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.