నా సొంత ఊళ్లోనే నీళ్లు రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి

66చూసినవారు
నా సొంత ఊళ్లోనే నీళ్లు రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
తన సొంత గ్రామమైన నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లెంలలో మిషన్ భగీరథ నీరు అందడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తన ఊర్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. శనివారం జిల్లా పరిషత్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏ గ్రామంలో కూడా నీరు అందడం లేదని, మిషన్ భగీరథ అధికారులు సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్