2024 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రంగాల ప్రతినిధులతో ఆ శాఖ ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దిల్లీలోని భారత్ మండపంలో భేటీ అయ్యారు. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలమ్మ సంప్రదింపులు జరిపారు.