ఆన్‌లైన్‌ గేమ్‌‌తో అప్పుల పాలు.. కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌‌ పరిధిలోని బండ్లగూడజాగీర్‌‌కు చెందిన ఆనంద్(42) అనే వ్యక్తి ఆన్‌లైన్‌‌లో గేమ్‌లు ఆడి అప్పుల పాలయ్యాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై భార్య, కుమారుడికి విషమిచ్చి.. అనంతరం ఆనంద్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్