ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి పోకో ఎక్స్5 పేరుతో కొత్త 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ను సూపర్ నోవా గ్రీన్, వైల్డ్క్యాట్ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఏప్రిల్ 21 నుంచి ఫ్లిప్కార్ట్తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించారు.