ఢిల్లీలో గతంలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100శాతం ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2021 జనవరి 5న ఢిల్లీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. వాళ్లంతా కలిసి రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.