ఢిల్లీ విమానాశ్రయంలోని 22 విమానాలను శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాలకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య జైపూర్కు 9, లక్నోకు-8, చండీగఢ్కు-2, వారణాసి, అమృత్సర్, అహ్మాదాబాద్ విమానాశ్రాయాలకు ఒక్కొక్కటి చొప్పున విమానాలను దారి మళ్లించామని పేర్కొన్నారు.