భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో (FY25) 7శాతం వృద్ధి సాధిస్తుందని RBI తన యాన్యువల్ రిపోర్ట్లో వెల్లడించింది. బ్యాలెన్స్ షీట్ FY24లో 11.08% వృద్ధి చెంది రూ.70.48లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఫోరెక్స్ లావాదేవీలతో రూ.83,616 కోట్ల లాభం, ఫారెన్ సెక్యూరిటీలపై వడ్డీతో రూ.65,328కోట్ల ఆదాయన్ని ఆర్జించింది. ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని, కానీ ఆహార ద్రవ్యోల్బణంతో సవాళ్లు ఎదురుకావొచ్చని RBI పేర్కొంది.