ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్కు ట్రయిల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను తాత్కాలికంగా నిలుపుదల చేయడం.. బెయిల్ రద్దుతో సమానమని అభివర్ణించారు. బెయిల్ మంజూరు చేయడానికి, రద్దు చేయడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసముందన్నారు. చట్టాన్ని దాట వేయడానికి ప్రయత్నిస్తోందంటూ ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు.