ముత్యాలమ్మ గుడిలో చోరీ

చంద్రుగొండ-గుర్రాయిగూడెం మార్గంలోని ముత్యాలమ్మ గుడిలో చోరీ జరిగినట్లు బుధవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆలయ ప్రధాన గేటు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు హుండీని పగలగొట్టి అందులోని సొమ్ము అపహరించారని స్థానికులు తెలిపారు. గుడి ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు హుండీలోని సొమ్ము లెక్కించలేదని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. చోరీపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్