గతంలో అకారణంగా పోలీసులు తనపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారని, ఇందుకు తన ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానం ఉందని భద్రాది ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డికి, తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి తనపై ఉన్న కేసును ఎత్తివేయాలని కోరారు.