ఇండియా కూటమి తరఫున లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా కే.సురేశ్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. సురేశ్ తో నామినేషన్ వేయించే విషయంలో ముందుగా TMCని సంప్రదించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.