అరకు కాఫీపై మంత్రి కీలక ప్రకటన

55చూసినవారు
అరకు కాఫీపై మంత్రి కీలక ప్రకటన
అరకు కాఫీకి సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నామని వెల్లడించారు. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతామని తెలిపారు. అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. నెలకోసారి గిరిజన హాస్టళ్లల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 554 ట్రైబెల్ స్కూళ్లల్లో ఏఎన్ఎంలను డెప్యూటేషన్ మీద నియమిస్తున్నామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్