చెరువు సర్వే చేయాలని వినతి

అడవిదేవులపల్లి గ్రామంలోని భాస్కర్ రావు చెరువు ఆక్రమణలు అడ్డుకోవాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు సోమవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సొసైటీ అధ్యక్షులు చెన్నబోయిన సైదయ్య మాట్లాడుతూ, సర్వే నెం. 59లో 136. 25 ఎకరాల విస్తీర్ణంలో చెరువు విస్తరించి ఉందని, కాగా చెరువు భూమిని కొందరు కబ్జాకి యత్నిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చెరువు హద్దులు గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్