మోపాల్ మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ప్రత్యేక అధికారి సురేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్, ఎంపిఓ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్