విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

59చూసినవారు
విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత
ఆర్మూర్ పట్టణానికి చెందిన పి. శశాంక్ బిబిఏ చదువు కోసం ఈరవత్రి రాందాస్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రూ. 20 వేలను శుక్రవారం అందజేశారు. శశాంక్ హైదరాబాద్ లోని ఐ క్రియేట్ కళాశాలలో బిబిఏ ఫైనలియర్ చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువు మధ్యలో మానేసే పరిస్థితి వచ్చిందని తెలుసుకొని ఈరవత్రి రాందాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు.

సంబంధిత పోస్ట్