పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. విద్యుత్ కొరత, అధిక పన్నులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారి పట్ల పాక్ భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో భద్రతా బలగాలపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారు. తాజాగా పాక్ ఆక్రమిత ఖైబర్ పఖ్తుంఖ్వాలోని తిరాహ్ వ్యాలీ ప్రాంతంలో పాక్ ఆర్మీ కాన్వాయ్పై పీఓకే ప్రజలు తుపాకులతో దాడి చేశారు. ఈ వీడియో సోషల్ వైరల్ అవుతోంది.