ప్రధాని మోదీ రెండురోజుల పాటు జమ్ముకశ్వీర్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.1500 కోట్లతో 84 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. శుక్రవారం శ్రీనగర్లో యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.