తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జూలై 5న రెండో బ్యాలెట్ను నిర్వహించబోతున్నారు. సంస్కరణవాదిగా గుర్తింపుపొందిన మసౌద్ పెజెష్కియన్, పిడివాది సయీద్ జలిలి ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చినవారే విజేత అవుతారని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి.