అంతర్జాతీయ వన్డే క్రికెట్లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా స్మృతి (7) నిలిచారు. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (7) రికార్డును ఆమె సమం చేశారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఈ ఫీట్ అందుకున్నారు. మిథాలీ ఈ ఫీట్ను 211 ఇన్నింగ్స్ల్లో అందుకోగా, స్మృతి 84 ఇన్నింగ్స్ల్లోనే సాధించడం విశేషం.