ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా వరుడిని సొంత తండ్రే హత్య చేశాడు. గౌరవ్సంఘాల్(29) అనే యువకుడు ఢిల్లీలో జిమ్ నడుపుతున్నాడు. గురువారం అతనికి వివాహం నిశ్చయించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రి రంగలాల్ కుమారుడిని 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు.