బాటిళ్లతో టైం బాంబులు తయారు చేసిన ఘటనలో ఓ మహిళతో పాటు ఇద్దరిని స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లోని లఖ్నవూలో చోటుచేసుకుంది. బాటిళ్లలో ఇనుప గుండ్లు, పేలుడు పదార్థాలను నింపి తయారుచేసిన ఈ టైం బాంబుల తయారీకి ఆర్డర్ చేసిన మహిళకు డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా జావెద్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్టీఎఫ్ పోలీసులు వెల్లడించారు.