రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ (131) మార్క్ వుడ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి బెన్ స్టోక్స్ చేతికి చిక్కాడు. రోహిత్ శర్మ, జడేజా (83*)తో కలిసి నాలుగో వికెట్కు 200 లకు పైగా పరుగుల బాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకి యువ సంచలనం, డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.