ఉపాధ్యాయులకు ఉండే గౌరవం గురించి చెప్పనవసరం లేదు. అయితే ఏపీలో టీచర్లుగా పనిచేసిన మహిళా నేతలే మంత్రులుగా మారడం ఆసక్తిగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఎమ్మెల్యే కాకముందు లెక్చరర్గా ఉద్యోగం చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత ఉపాధ్యాయురాలుగా పని చేసినవారే. ఇప్పుడు ఏపీ హోంమంత్రి అనిత కూడా టీచర్గా పని చేసినవారే.