సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: సీఎం మమతా

62చూసినవారు
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: సీఎం మమతా
ఓబీసీ సర్టిఫికెట్ల విషయంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో 2010 నుంచి జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్‌లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశఆలు ఇచ్చింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్