తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవీ విరమణ చేశారు. దీంతో 5 డిప్యూటీ ఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదం కొనసాగుతుండటంతో.. ప్రమోషన్లను టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపి వేశారు.