ఏలేరు దిగ్బంధంలో 64 పల్లెలు

85చూసినవారు
ఏలేరు దిగ్బంధంలో 64 పల్లెలు
AP : ఏలేరు వరద ఉద్ధృతికి కాకినాడ జిల్లాలోని పరీవాహక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. తాజా వరదల ప్రభావం ఎనిమిది మండలాల పరిధిలోని 64 గ్రామాలపై పడింది. 11,803 కుటుంబాలు ముంపు సమస్యతో విలవిల్లాడుతున్నారు. 375ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మరోవైపు జాతీయ రహదారి-216పై గొల్లప్రోలు, పిఠాపురం మధ్యలో భారీగా వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్