67 మంది భారతీయులను కాపాడిన భారత ఎంబసీ

71చూసినవారు
67 మంది భారతీయులను కాపాడిన భారత ఎంబసీ
ఉద్యోగాల పేరిట కాంబోడియాలో చిక్కుకున్న 67 మంది భారతీయులను భారత ఎంబసీ కాపాడింది. ఉద్యోగాల పేరిట సైబర్‌ ముఠాలు కొందరిని కాంబోడియాకు తీసుకెళ్లారు. ఈ ముఠా కాంబోడియా నుంచే భారత్‌లో సైబర్‌ నేరాలు చేయించింది. దీంతో భారత రాయబార కార్యాలయానికి బాధితులు సమాచారం అందించడంతో స్పందించి.. వారిని రక్షించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 770 మందిని భారత ఎంబసీ కాపాడింది.

సంబంధిత పోస్ట్