AP: రాష్ట్రంలో ప్రస్తుతం 1.95 లక్షల మంది గ్రామ/వార్డు వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 68,901 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. రాజీనామా చేసిన వారిలో రూరల్ నుంచి 56,160 మంది, అర్బన్లో 12,741 మంది ఉన్నారని పేర్కొన్నారు. వారి IDలను అఫీషియల్గా టర్మినేట్ చేసినట్లు వివరించారు. ఈసీ ఆంక్షల నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.