టిఫిన్ చేస్తున్న వారిపై దూసుకెళ్లిన బస్సు (వీడియో)

551చూసినవారు
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఫిన్ చేస్తున్న వారిపై అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే ఒక కారు, 4 ద్విచక్ర వాహనాలు, ఫలహారం అమ్మే వాహనం ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్