కడప జిల్లా గౌస్ నగర్లో జరిగిన అల్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ వర్గీయులకు సంబంధించి 47 మందిపై కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టూటౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 24 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది.