తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. "నేను లోకేశ్ను కలిసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఒక నాయకుడిగా, సర్పంచ్గా, వార్డు మెంబర్గా నేను గుర్తించలేదు. దొడ్డిదారిలో వచ్చి MLC, మంత్రి అయ్యారు. జీవితకాలం జగనన్న వెంటే ఉంటా." అని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.