బస్సును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

84చూసినవారు
బస్సును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి
చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలోకి వస్తున్న బస్సును లారీ డీకొట్టింది. అదే సమయంలో డిపో నుంచి బయటకెళ్తున్న మరో బస్సును వేగంగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకొని కంటైనర్ కిందపడి చనిపోయాడు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ బాబా మస్తాన్‌గా పోలీసులు గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా లారీ ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్